Hyderabad Metro Rail Inauguration
భారత ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా 3గంటలకు మెట్రో రైల్ పైలాన్
ఆవిష్కరణ…
భద్రతాలోపాలు రావద్దు… సి ఎస్ ఎస్పి సింగ్ పోలీసుల పలు అధికారులతో
సమీక్ష….
ప్రధాని పర్యటన ఇలా!
ఎన్నొ సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మెట్రో రైల్ ఈ నెల 28న భారత ప్రధాని నరేంద్ర మోది చేతుల మీదుగా ప్రారంభం కాబోతుందుని ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులలో ఏ మాత్రం అవకతవకలు ఉండకూడదని పోలీస్ శాఖ తో పలు సంబంధిత అధికారులకు రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి సింగ్ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేగంపేట లో ప్రధాన మంత్రి విమానం దిగి అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా మియాపూర్ మెట్రో రైల్ డిపోకి చేరుకొని ఫైలాన్, ప్రారంభించి మియాపూర్ స్టేషన్ నుండి మెట్రో రైల్ కు పచ్చజెండా ఉపి ప్రారంభిస్తారని, అనంతరం ప్రత్యేకంగా ముస్తాబు చేసిన మెట్రో రైల్ ఎక్కి మియాపూర్ నుండి కూకట్ పల్లి వరకు ప్రయాణం చేస్తారని అన్నారు. కార్యక్రమాలకు ఎక్కడ అవాంతరం జరగకూడదని, లోపాలు లేకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. బేగంపేట, శంషాబాద్ విమానాశ్రాయాలు, మియాపూర్, హెచ్ ఐ సిసి, ఫలక్ నామా ప్యాలేస్, గోల్కొంగ ప్రాంతాలలో జరుగుతున్న ఏర్పాట్లు సమీక్షించారు. ప్రధాన మంత్రి బేగంపేట విమానాశ్రయంలో రాష్ర్ట గవర్నర్ ఈ ఎల్ ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, రాష్ర్ట మంత్రులు స్వాగతం పలుకుతున్నటుల అధికారులకు సిఎస్ వివరించారు. ప్రధాన బేగంపేట నుండి మియాపూర్ మెట్రో రైల్ ప్రారంభం అనంతరం హెచ్ ఐసిసిలో జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొంటారని తెలిపారు. ప్రధాని పర్యటించే మార్గంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులకు తెలిపారు.